Advertisement

గణిత ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్

భీమదేవరపల్లి జోర్దార్ విలేఖరి

భీమదేవరపల్లి మండల వనరుల కేంద్రంలో టీఎంఎఫ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులలో పఠనాసక్తి, విషయ నైపుణ్యం, తార్కిక చింతన పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ టాలెంట్ టెస్టును మండల నోడల్ అధికారి శ్రీమతి సునీత రాణి ప్రారంభించి మాట్లాడుతూ.. విద్యార్థులు గణితాన్ని కష్టపడి కాకుండా ఇష్టపడి ప్రాక్టీస్ చేస్తే సులభంగా వస్తుంది అని తెలిపారు . ఈ టెస్టులు విద్యార్థులలో పరీక్ష భయాన్ని పోగొట్టి ఫైనల్ పరీక్షలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మంచి ఫలితాన్ని సాధిస్తాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలో మండలంలోని వివిధ పాఠశాలల నుండి ప్రతిభా వంతులైన సుమారు 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు అరటిపండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఎమ్ఎఫ్ మండల అధ్యక్షులు కె ఎల్లయ్య , ప్రధాన కార్యదర్శి రవీందర్ తో పాటు మండలంలోని అన్ని పాఠశాలల గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *