Advertisement

విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

*విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి*:*జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ జోర్దార్ ప్రతినిధి

విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మన జిల్లా స్థాయి ఇన్స్పైర్,
విద్య,వైజ్ఞానిక ప్రదర్శనను అధికారులు, అతిథులతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్య,వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం,కొత్త విషయాలు నేర్చుకోవాలన్న కుతూహలం శోధన,పరిశీలన వంటివి పెంపొందించుతాయని తెలిపారు.ఈ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగుతుందని,విద్యార్థులకు ఆచరణాత్మక విద్యను అందించడం ద్వారా ఇటువంటి వైజ్ఞానిక ఆవిష్కరణలు తయారు చేయగలుగుతారని ఆమె తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల నుండి దాదాపు 800 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనల నుండి ఎక్కువ సంఖ్యలో రాష్ట్రస్థాయిలో ఎంపిక కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిఇఓ పి.రామారావు, సలోమి కరుణ,ఏ సి జి ఇ పద్మ, గ్రంధాలయ చైర్మన్ అర్జున్ అలీ, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు,ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *